ఏపీ రాజకీయాల్లో నాయకుల దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నచ్చలేదు: కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండు రోజుల కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తనకు ఒక విషయం నచ్చడం లేదని, ఇక్కడ నాయకులు మాట్లాడే విధానం సరిగ్గా లేదని ఆమె అన్నారు. ఏపీలోని రాజకీయ నాయకులు ఒకరినొకరు తీవ్రంగా దూషించుకోవడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, దుర్భాషలాడటం, అలాగే ఒకరినొకరు వ్యక్తిగతంగా అవమానించుకోవడానికి ప్రయత్నించడం తనకు ఇష్టం లేదని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, రోజా వంటి నాయకులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కవిత ఈ అంశాన్ని ఎత్తి చూపినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో, కల్వకుంట్ల కవిత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేసిన ఒక్క ఫోన్ కాల్ ద్వారానే బీసీ మైనారిటీ సమస్యను క్షణాల్లో పరిష్కరించారన్నారు. ఈ ఉదంతాన్ని ఉదాహరిస్తూ, కవిత చంద్రబాబుపై తన సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ ఎదుర్కొన్న తర్వాత కవిత, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. తాను బలమైన స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటానని, త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు