బాలకృష్ణపై వై.ఎస్. జగన్ సంచలన వ్యాఖ్యలు: ‘తాగి’ అసెంబ్లీకి వచ్చారని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ (YS Jagan) తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ ఈ ఆరోపణలు చేశారు. బాలకృష్ణ ‘తాగి’ అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదని జగన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వహించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటుగా బదులిస్తూ, “అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు” అని తీవ్రంగా విమర్శించారు.

తన వ్యాఖ్యలను మరింత తీవ్రతరం చేస్తూ, జగన్ స్పీకర్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. “తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదు” అంటూ జగన్ ఘాటుగా స్పందించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితిని ఉద్దేశిస్తూ, “బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి” అని జగన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక సీనియర్ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతిపై కొత్త చర్చకు తెర తీసింది.

ఇదిలా ఉండగా, బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు చిరంజీవి గతంలోనే స్పందించిన విషయాన్ని జగన్ వర్గం ఇప్పుడు గుర్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని, నాటి ముఖ్యమంత్రి జగన్ తనను గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారని చిరంజీవి అప్పట్లోనే స్పష్టం చేశారని జగన్ వర్గం ఇప్పుడు తమ వాదనకు బలం చేకూర్చుకుంటోంది. ఈ వ్యవహారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు