తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన నేరుగా యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (US-India Strategic Partnership Forum) పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అపారమైన అవకాశాలను, ముఖ్యంగా హైదరాబాద్లో పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే భరోసాను ఈ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక వసతులు మరియు ప్రోత్సాహకాలను గురించి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. తద్వారా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గల అనుకూలతలను వివరించి, భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయనున్నారు. ఈ వ్యూహాత్మక సదస్సు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడనుంది.
సదస్సు అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులను కోరనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరడం ఈ ఢిల్లీ పర్యటనలోని ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.









