తెలంగాణ విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయ్: 2047 నాటికి భారీ డిమాండ్

తెలంగాణలో విద్యుత్తు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్తు రంగంపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, దీనికి పెట్టుబడులు అవసరమని, ఆ పెట్టుబడులకు విద్యుత్తు సరఫరా కీలకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

గత పదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా, డేటా సెంటర్ల ఏర్పాటుతో హైదరాబాద్ త్వరలో గ్లోబల్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు, పెరుగుతున్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు రంగాన్ని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగిన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రంలో లక్షా 39 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుందని ఆయన అంచనా వేశారు. ఈ పెరుగుతున్న విద్యుత్తు వినియోగానికి అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు