జాతీయ రహదారి భద్రతా – మాసోత్సవాలు
” శిక్షణతో భద్రత — సాంకేతిక ద్వారా పరివర్తన*
శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి మున్సిపాలిటీ కుటాగుళ్ల గ్రామంలో ఉన్న ఆర్టీవో ఆఫీస్ నందు కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జీవితం చాలా విలువైనదని, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించవచ్చు. వాటి వల్ల అంగవైకల్యం కూడా జరిగి కుటుంబానికి భారం కావలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వరప్రసాద్, కరుణాకర్ రెడ్డి కృష్ణమోహన్ నాయుడు, అనిల్ కుమార్ రెడ్డి, బ్లూ మూన్ శివశంకర్ , విద్యార్థులు పాల్గొన్నారు
Post Views: 49









