చందన గ్రామంలో మంగళవారం నాడు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గారు మాట్లాడుతూ, గ్రామస్థుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూ వివాదాలు, ధరణి సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
Post Views: 44









