ఈరోజు గుంతకల్ పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా సర్కిల్లో భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన గుంతకల్ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి గారు, గుజిరి మహమ్మద్ ఖాజా, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, Y. సుధాకర్, ఫజులు రెహమాన్, ప్రసంగించినారు మరియు కుటుంబ కూటమి నాయకులు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.
భారతదేశ స్వతంత్ర సమర యోధులుగా మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన కృషి మరువలేనిది ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు, భారత ప్రభుత్వం ఆజాద్ కి “భారతరత్న” బిరుదుతో సత్కరించినారు.ఆజాద్ 1958 సం॥లో ఫిబ్రవరి 22 తారీఖున పరవపదించారు. భావి భారత పౌరులు పిల్లలకు ఇలాంటి గొప్ప వారి విషయాలను చెప్పి వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దాలి అని అన్నారు.








